దగ్గుబాటి వెంకటేశ్వర కుటుంబం లాలూచీ పరాకాష్టకు చేరుకుందని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. తల్లి పురంధేశ్వరి బీజేపీలో ఉండగా, ఆమె కుమారుడు ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారని మండిపడ్డారు. అధికారం కోసమే జగన్ కు దగ్గుబాటి కుటుంబం వంత పాడుతుందని ఆరోపించారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలు అగ్నిగుండంలా మండిపోతున్నారని, ఆ అగ్నిగుండంలో వైసీపీ, బీజేపీ దగ్ధం అవుతాయని నారాయణ జోస్యం చెప్పారు.