ప్రధాని మోడీతో పాటు వైసీపీ అధినేత జగన్పై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి నారా లోకేష్. తెలుగు జాతిపై ప్రధాని దాడి చేస్తున్నారంటూ లోకేష్ ఆరోపించారు. విభజన హామీలు అమలుచేయాలంటూ కోరిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మాత్రం ప్రశ్నించడం లేదన్నారు. దొంగ పుత్రుడంటూ జగన్ను అభివర్ణించిన నారా లోకేష్ వైసీపీ రోజుకో డ్రామా ఆడుతూ డ్రామా పార్టీగా మారిందంటూ విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ను ఆంధ్ర ద్రోహుల పార్టీ అంటూ విమర్శించిన లోకేష్ 2019లో బీజేపీకి అసలైన సినిమా చూపిస్తామన్నారు.