ఏపీ మంత్రి ఫరూక్‌ ఓటు గల్లంతు!

Update: 2019-03-08 11:53 GMT

ఏపీలో సాక్షాత్తు మంత్రి ఫరూక్ ఓటు గల్లంతయింది. కర్నూలులో జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు , తనతో పాటు తన కుటుంబసభ్యులు, బంధువుల ఓట్లు కూడా తొలగించారని అన్నారు. నంద్యాలలో టీడీపీ సానుభూతిపరులైన మైనార్టీల ఓట్లను కూడా తొలగించారని మండిపడ్డారు. దీనిపై అధికారులను సంప్రదించగా తమకు ఆ విషయం తెలియదని సమాధానం చెప్పారని మంత్రి పేర్కొన్నారు. ఓట్ల తొలగింపు వెనుక వైసీపీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఎనిమిది సార్లు పోటీచేసిన తన ఓటే గల్లంతైతే ఇక సామాన్య ప్రజల ఓట్ల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఎన్నికల్లో గెలవడానికి అక్రమ మార్గాలను ఎంచుకుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.  

Similar News