వాళ్లే సీన్ క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తారు...జాగ్రత్త: బాబు

Update: 2019-02-21 05:43 GMT

అధికారం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైసీపీ అని ఆరోపించారు సీఎం చంద్రబాబు. వాళ్లు, ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు వీడియోలు ఎడిటింగ్ చేస్తారని తెలిపారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. హత్యలు, దోపిడీలు, దాడులు ప్రత్యర్థుల సంస్కృతి అని వారి నేర చరిత్ర గుర్తుంచుకోవాలని తెలిపారు.

ఈ ఎన్నికల్లో తాము పోటీపడేది నేరస్థులతోనని వారితో పోరాటంలో అప్రమత్తతతో ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రతిపక్షం, చేయని తప్పులను కూడా తమపై రుద్దుతుందని ఆరోపించారు. తప్పులు జరిగేలా వాళ్లే స్కెచ్ లు వేస్తారని ఒక కన్ను ఎప్పుడూ ప్రతిపక్షంపై ఉండాలని నేతలకు సూచించారు.  

Similar News