ఈ నెల 23 న జరిగే ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పులు ఫారమ్ 17 సీ లెక్కలతో సరిపోవాలన్నారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తితే తొలుత బాగున్న ఈవీఎంలను లెక్కించి ఆ తర్వాత పాడైన ఈవీఎంల తాలూకు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని వివరించారు. కౌంటింగ్కు ముందు నిర్వహించే మాక్పోల్ రిపోర్ట్ కూడా లెక్కలకు సరిపోవాలని తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎం ఓట్లతో సరిపోవాలని తేడా వస్తే మరోసారి లెక్కిస్తామన్నారు. మొరాయించిన ఈవీఎంల లెక్కింపు మాత్రం చివర్లో జరుగుతుందని చెప్పారు. ఒట్ల లెక్కింపులో పార్టీల మధ్య అభిప్రాయభేదాలొచ్చినా పార్టీల మధ్య తక్కువ మార్జిన్ వచ్చినా రీ కౌంటింగ్ నిర్ణయాధికారం మాత్రం రిటర్నింగ్ ఆఫీసర్, అబ్జర్వర్లదే అని స్పష్టం చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు.