నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

Update: 2019-06-12 01:43 GMT

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వంలో మొదటి సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదురోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు... ఈ ఉదయం 11.05 నిమిషాలకు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా నేడు.. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాచుడు... ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎల్లుండి స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను శాసనసభ ఎన్నుకోనుంది. ఇదిలా ఉంటే... ఈ సమావేశాల్లో ఈనెల 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో సభకు సెలవు ఉంటుంది. ఇక 17, 18వ తేదీన సమావేశాలు యధావిధిగా జరుగుతాయి. 18వ తేదీలో ఈ సమావేశాలు ముగియనున్నాయి. తిరిగి జూలైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.   

Tags:    

Similar News