చొప్పదండి ఎంపీటీసీ కిడ్నాప్ కేసులో మరో మలుపు

Update: 2019-06-07 01:49 GMT

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన ఎంపీటీసీ కిడ్నాప్ కేసు మరో మలుపు తిరిగింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తాను క్షేమంగానే ఉన్నానంటూ దేశాయిపేట ఎంపీటీసి తిరుపతి ఓ వీడియోను రిలీజ్ చేశారు. చొప్పదండి మండలానికి చెందిన బీజేపీ ఎంపీటీసీ సభ్యులను దాచిపెట్టారంటూ.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అర్ధరాత్రి వరంగల్ లోని సిటీ గ్రాండ్ హోటల్ చేరుకుని ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ నాయకులు, తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేసి తీసుకువచ్చారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. దేశాయిపేట ఎంపీటీసి తిరుపతి ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Tags:    

Similar News