ఓడిశాలో మరో దారుణం .. పదవ తరగతి బాలిక పై సాముహిక అత్యాచారం

Update: 2019-06-26 03:45 GMT

వరుస అత్యాచారాలతో దేశం మొత్తం ఉక్కరి బిక్కిరి అవుతుంటే కామందులు మాత్రం తమకి అడ్డు అదుపు లేకుండా పోతుంది . విరి నుండి అమ్మాయలకు రక్షణ లేకుండా పోయింది .. ఇది ఇలా ఉంటె ఓడిశాలోని కేంఝర్‌ జిల్లా జోడా ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక సోమవారం బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వెళ్తోంది. ఇదే సమయంలో ఆమె పై కన్ను వేసిన ఐదుగురు యువకులు ఆమె పై కన్ను వేసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు .. దీనితో అ బాలిక అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆ యువకుడు ఓ మైదానం ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. తరవాత విషయం తెలుసుకున్న స్థానికులు తన తల్లి తండ్రులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు .. భాదితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు ...  

Tags:    

Similar News