ఆర్టీసీ బస్సు బోల్తా.. 20మందికి తీవ్రగాయాలు

Update: 2019-05-17 10:42 GMT

తెలంగాణ ఆర్టీసీకి చెందిన మరో బస్సు ప్రమాదానికి గురైంది. తాజాగా మంచిర్యాల జిల్లా జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల నుంచి చెన్నూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా సమయంలో బస్సులో 70 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Similar News