గర్భిణిపై దాడి... పిండం బయటకు...

భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం, మద్దిరాల తండాలో ఘోరం జరగింది. అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న నీలా ఓ గర్బిణీపై ఇష్టమొచ్చినట్లు దాడి చేయడంతో అబార్షన్ అయింది.

Update: 2019-01-08 04:19 GMT
padma

భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం, మద్దిరాల తండాలో ఘోరం జరగింది. అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న నీలా ఓ గర్బిణీపై ఇష్టమొచ్చినట్లు దాడి చేయడంతో అబార్షన్ అయింది. మద్దిరాల తండాకు చెందిన పద్మకు ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం పద్మ మళ్లీ గర్భం దాల్చింది. తన కుమార్తెలిద్దరూ అంగన్ వాడీ కేంద్రంలో చదువుతున్నారు. అంగన్ వాడీ కేంద్రంలో ఇవ్వాల్సిన గుడ్ల గురించి నీలాను అడిగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పద్మతో ఘర్షణకు దిగిన నీలా తన భర్తను కూడా తీసుకువచ్చి దాడి చేసింది. దీంతో పద్మకు అబార్షన్ అయింది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News