తెలంగాణ ఎమ్మెల్యేలకు జరిగినట్లు ఏపీలో జరగలేదు: చంద్రబాబు

Update: 2019-05-04 11:20 GMT

పక్క రాష్ట్రం తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీశారని, అయితే మన రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి రాలేదని ఏపీ ఆపద్దర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడైనా టీడీపీ తప్పు చేసిందని ఎవరైనా నిలదీశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది మనమందరం గర్వంగా చెప్పుకోవాల్సింది ఇదేనని చంద్రబాబు అన్నారు. ఇక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ కార్యకర్తలు సిద్ధం కావాలని నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రకృతి కూడా టీడీపీకి బాగా కలిసివచ్చిందని, తొలిదశలో ఎన్నికలు పెట్టడం బాగా మేలైందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కొందరూ కావాలనే తమను చాలా రకలుగా ఇబ్బందులు పెట్టాలని చూశారని కానీ, ప్రజలు మాత్రం తమ నెత్తినే పాలు పోశారని అన్నారు. ఎన్నికల్లో చాలామంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని చంద్రబాబు అన్నారు.

Similar News