ఇంటర్‌ బోర్డు నిర్వాకానికి అనామిక బలి

Update: 2019-06-01 15:09 GMT

తెలంగాణలో ఇంటర్‌ బోర్డ్‌ నిర్లక్ష్యానికి అనేక మంది విద్యార్థులు బలయ్యారు. ఏప్రిల్‌లో ఫలితాలు విడుదలైన తర్వాత అనామిక అనే విద్యార్థినికి తెలుగులో 20 మార్కులు వచ్చాయి. దీంతో మనస్థాపం చెందిన అనామిక ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇటీవల రీ వెరిఫికేషన్‌లో అనామికకు 48 మార్కులు వచ్చినట్టు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. దీంతో బోర్డు వ్యవహారంపై విద్యార్థిని అనామిక తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News