రాజమండ్రి బీజేపీ సభలో చంద్రబాబుపై అమిత్షా నిప్పులు చెరిగారు. ఉగ్ర దాడిలో 40మంది భారత జవాన్లు అమరులైతే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా మాట్లాడతావా? అంటూ ఫైరయ్యారు. ఇదేనా మీ దేశ భక్తి అంటూ ప్రశ్నించారు. ఓట్ల కోసం ఎంతకైనా దిగుజారుతారా అంటూ చంద్రబాబుపై అమిత్షా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించింది మోసం చేసిందీ చంద్రబాబేనన్నారు అమిత్షా. ఢిల్లీ, కోల్కతా, కర్నాటకల్లో ధర్నాలు చేయడం కాదు ముందు టీడీపీ కార్యాలయం ముందు దీక్ష చేయాలంటూ బాబుకి సూచించారు.