విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు పొట్లూరి వరప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. తాను గెలిచినా, గెలవకపోయినా తాను ఎప్పటికీ విజయవాడ వాసినేనని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్ అన్నారు. తాను 19 రోజులే పార్లమెంట్ పరిధిలో తిరిగినట్లు చెప్పారు. కొంచెం ముందు వచ్చి ఉంటే భారీ మెజార్టీతో గెలిచేవాడనని చెప్పుకొచ్చారు. ఇక నుంచి రెగ్యులర్గా విజయవాడ ప్రజలతోనే ఉంటానని ప్రకటించారు. తాను 130 స్థానాలకు పైగా వైసీపీ గెలుస్తుందని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా తక్కువ మార్జిన్తోనే ఓడిపోయానన్నారు.