తెలంగాణలో జరిగిన రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజీలో, నల్గొండ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు దుప్పలపల్లి ఎస్డబ్ల్యూ గోడౌన్లో, వరంగల్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ఎనుమాముల మార్కెట్యార్డులో జరుగుతుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మూడు నియోజకవర్గాల్లో 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిలవగా, వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మాత్ర టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు ముగ్గురు స్వతంత్రులు బరిలో నిలిచారు. మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో 2,799 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.