ప్రభుత్వ సలహాదారుగా కల్లం బాధ్యతలు స్వీకరణ

Update: 2019-06-05 12:55 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారుగా అజేయ్‌ కల్లం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో చాంబర్ ను కేటాయించారు. అజేయ కల్లంను ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ హోదాతో కూడిన పదవిని ఆయనకు అప్పగించిన విషయం తెలిసిందే. ఇకపై ముఖ్యమంత్రి కార్యాలయం అధిపతిగా ఆయన వ్యవహరించనున్నారు. ప్రభుత్వ సలహాదారులతో పాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు కల్పించింది. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. 

Tags:    

Similar News