సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అజేయ కల్లం

Update: 2019-06-05 04:47 GMT

ఏపీ సీఎం ముఖ్యకార్యదర్శిగా నియమితులైన మాజీ సీఎస్‌ అజేయ కల్లం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిని కలిశారు. కాగా అజేయ కల్లం కేబినెట్‌ హోదాతో సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కీలక పదవిలో నియమించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అజేయ కల్లం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎం పేషీ) అధిపతిగా వ్యవహరిస్తారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అజేయకల్లం పేషికి పది మంది సిబ్బందిని కేటాయించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శులతో పాటు ప్రభుత్వ సలహాదారులందరికీ అజేయ కల్లం నాయకత్వం వహించనున్నారు.  

Tags:    

Similar News