మద్యం మత్తులో చిందులేసిన వ్యవసాయ మార్కెట్ అధికారులు...

Update: 2019-06-15 10:01 GMT

మద్యం మత్తులో తమ స్థాయిని మరిచి చిందులేసారు కొందరు వ్యవసాయ మార్కెట్ అధికారులు.. పాటకు తగ్గ స్టెప్స్ వేస్తూ డాన్సులతో రెచ్చిపోయారు .. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ అవుతుంది . ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చోటు చేసుకుంది . గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీల అధికారులు ఈ మందు పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది . గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేందర్, ముస్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, ఇతర మార్కెట్ కమిటీల అధికారులు మద్యం సేవించి చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ప్రత్యక్షమైంది.

Tags:    

Similar News