లగడపాటి రాజగోపాల్‌పై పోలీస్ కేసు

Update: 2019-05-27 07:37 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని సర్వే చేసి చెప్పిన లగడపాటి రాజగోపాల్‌పై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన తప్పుడు సర్వేల కారణంగా చాలామంది నష్టపోయారని మురళీకృష్ణ తెలిపారు. లగడపాటి వెనుక అంతర్జాతీయ బెట్టింగ్ మాఫియా అండదండలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు అడ్వకేట్ మురళీ కృష్ణ. ఈ తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నా వారిని విచారణ జరిపి తేల్చాలని పోలీసులను మురళీ కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Similar News