మహారాష్ట్ర సోలాపూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం

Update: 2019-06-07 03:54 GMT

మహారాష్ట్ర సోలాపూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగిఉన్న లారీని తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు ఢీకొట్టడంతో.. బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సోలాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పండపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు.. సోలాపూర్, పూణె జాతీయరహదారిపై ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆర్టీసీ బస్సుతో పాటు లారీ కూడా పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, పలువురి తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.  

Tags:    

Similar News