ఈ మధ్య హత్యలు అనేవి చాలా కామన్ అయిపోతుంది . మానవ సంబంధాలుకి కూడా విలువలు లేకుండానే పోతున్నాయి .. ఇందులో మహిళలు పైన మరీను .. ఈ నేపధ్యంలో ఒప్పుకున్నా కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని కట్టుకున్న భార్యపైన దాడి చేసి కత్తితో పొడిచి చంపేసాడు ..
చత్తీస్గఢ్ రాష్ట్ర్రంలోని ముంగేళీ జిల్లాలోని బోడ్రా గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది . భార్య పుట్టింటి వారు కట్నంలో భాగాంగా ఒప్పుకున్న మోటార్ బైక్ ము ఇవ్వలేదని ఓ భర్త, భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అనంతరం కత్తితో పోడిచి చంపి వేశాడు. ఇక ఆమే మరణాన్ని ఆత్మహత్యగా చీత్రీకరించే ప్రయత్నం చేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా నిందితుడు అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు .. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు ..