తలకు రంగేసుకొని ఆలయంలోకి ప్రవేశించా..!

శబరిమలలో టెన్షన్‌ కొనసాగుతోంది. తాజాగా మరో మహిళ శబరిమల ఆలయంలోకి ప్రవేశించింది. కొల్లాంకు చెందిన 36 ఏళ్ల మంజు ఈ నెల 8న శబరిమల ఆలయంలోకి ప్రవేశించినట్టు ప్రకటించుకుంది.

Update: 2019-01-10 08:23 GMT
Manju

శబరిమలలో టెన్షన్‌ కొనసాగుతోంది. తాజాగా మరో మహిళ శబరిమల ఆలయంలోకి ప్రవేశించింది. కొల్లాంకు చెందిన 36 ఏళ్ల మంజు ఈ నెల 8న శబరిమల ఆలయంలోకి ప్రవేశించినట్టు ప్రకటించుకుంది. మొదటిసారి బిందూ, కనకదుర్గ అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టగా కొనసాగింపుగా పలువురు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

వృద్ధురాలి వేషంలో మంజు శబరిమల ఆలయంలోకి ప్రవేశించింది. 50 ఏళ్ల లోపు వారిని అడ్డుకుంటూ ఉండటంతో తలకు తెల్ల రంగు వేసుకొని అయ్యప్ప దర్శనానికి వెళ్లినట్టు మంజు తెలిపారు. 18 మెట్ల ద్వారా దర్శనానికి వెళ్లానని, ఇక మీదటా ఆలయంలోకి వెళ్తానని ప్రకటించారు. గత అక్టోబర్‌లో ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 20 మంది మహిళల్లో మంజు కూడా ఉన్నారు. 

Similar News