ముంబై థానేలోని ధోకాలి ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేస్తూ ప్లాంట్లో ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పశ్చిమ థానేలోని ధోకాలిలోని ప్రైడ్ ప్రెసిడెన్సీ లక్సేరియా నివాస సముదాయంలో చోటు చేసుకుంది. డ్రైనేజీని క్లీన్ చేసేందుకు 8 మంది మురుగును శుద్ధి చేసే ప్లాంట్లోకి దిగారు. 130 క్యూబిక్ మీటర్ల లోతు ఉన్న ఈ ప్లాంట్లో విషవాయువుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అమిత్ ఫుహల్(20), అమన్ బాదల్(21), అజయ్ బంబుక్(24)గా గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిని రమ్మర్ పుహల్(30), విజేంద్ర హత్వల్(25), మంజిత్ విద్య(25), జస్బీర్ పుహల్(24), అజయ్ పుహల్(21)గా గుర్తించారు.