ప్రధానిగా మళ్లీ మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్.90 శాతం మంది ప్రజలు ప్రధానిగా మోడీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. కేసీఆర్ను ప్రధాని అభ్యర్థిగా ఎవరూ చూడడం లేదని ఎద్దేవ చేశారు. పార్లమెంట్ సెగ్మెంట్ల క్లస్టర్ల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొని కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తారని ధర్మపురి అరవింద్ అన్నారు.