సీఎం జగన్ రాజకీయాల్లో రియల్ హీరో : కృష్ణంరాజు

Update: 2019-06-08 08:33 GMT

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నూతన మంత్రిమండలి కొలువుదీరింది. కొత్తగా మంత్రులుగా ఎన్నికైన 25మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ నరసింహన్‌ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. తన మంత్రి మండలి కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయానికి అగ్రప్రాధాన్యం కల్పించారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులుకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. కొత్త మంత్రులకు కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత కృష్ణంరాజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సామాజిక విప్లవానికి నాందిగా తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరిణతి చెందిన ప్రజానాయకుడిగా మీరు స్పీకర్ పదవి బీసీలకు, డిప్యూటీ స్పీకర్ పదవి బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయం అని అన్నారు. ప్రజల అఖండ అభిమానం ఉన్న నాయకుడిగా పిన్న వయసులోనే ప్రజానేతగా ఎదిగిన మీరు రాజకీయాల్లో రియల్ హీరో అంటూ పొగిడారు.

Tags:    

Similar News