బాబు పిలవకున్నా పని కట్టుకోని వెళ్లి ఏపి పరువు తీస్తున్నాడు ..

Update: 2019-05-21 09:26 GMT

ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో బాబు తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత రామచంద్రయ్య విమర్శించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన అయన బాబుపై ఈ వాఖ్యలు చేసారు . కొన్ని గంటల్లో విడుదల అవనున్నా ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉండడం అయన జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దావా చేసారు ..

చంద్రబాబు హుదతనాన్ని పక్కనపెట్టి దేశంలో ఎవరు పిలవకున్నా ఈయనే పనిగట్టుకొని పక్కా రాష్ట్రాలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ పరవు తీస్తున్నాడని అయన అభిప్రాయపడ్డారు . అసలు చంద్రబాబుకి విలువ ఎక్కడ లేదని ఆయన అన్నారు. అయన ఎంత తిరిగిన ప్రయోజనం మాత్రం ఉండదని ఎద్దావా చేసారు .

సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం నిజంగా సిగ్గు చేటన్నారు. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని రామచంద్రయ్య ఆరోపించారు.

Similar News