నేడు ఫ్రాన్స్లో జీ-7 దేశాల సదస్సు
ఫ్రాన్స్లో ఇవాళ జి-7 దేశాల సదస్సు ప్రారంభం కానుంది. ఇరాన్ సంక్షోభం, చైనాతో అమెరికా వాణిజ్య పోరు వంటి అంశాలు.. సదస్సులో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఫ్రాన్స్లో ఇవాళ జి-7 దేశాల సదస్సు ప్రారంభం కానుంది. ఇరాన్ సంక్షోభం, చైనాతో అమెరికా వాణిజ్య పోరు వంటి అంశాలు.. సదస్సులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. బ్రెగ్జిట్, భూతాపం వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. జి-7 దేశాల సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఆహ్వానం మేరకు మోడీ సదస్సుకు హాజరవుతున్నారు. మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. భారత్లో అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని ఈ సందర్భంగా.. ట్రంప్ మోడీని కోరే అవకాశాలున్నట్లు.. అధికార వర్గాలు వెల్లడించాయి.