సాధారణంగా కొందరికి విమానాలు చూడాలని, కొందరికి ఆ విమానంలో ప్రయాణం చేయాలని కొందరు అనుకుంటారు కదా! అయితే ఓ వ్యక్తి మాత్రం విమానంలో ప్రయాణించడం కాదు.. ఏకంగా విమానం రెక్కల పైనే ఎక్కి కూర్చున్నాడు. మరో కొద్ది నిమిషాల్లో విమానం టేకాఫ్ అయ్యేందుకు రేడీగా ఉన్న తరుణంలో ఇంతలోనే ఓ వ్యక్తి విమానం రెక్కలపైకి అవుపించాడు. విమానం రెక్కలపై అటు ఇటు తిరుగుతూ హల్ చల్ చేశాడు. ఈ ఘటన ఈ నెల 19న ఐయిజాలోని ముర్తాలా ముహమ్మద్ ఎయిర్పోర్ట్లో చోటుచేసుకుంది. నైజీరియాలో జరిగిన ఘటనకు సంబంధిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఐయిజాలోని ముర్తాలా ముహమ్మద్ ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి విమానం బయలుదేరే సమయంలో విమాన రెక్కలపైకి ఎక్కటం చూసిన ప్రయాణీకులు నిర్ఘాంతపోయారు. వెంటనే కేకలు వేస్తూ భయంతో వణికిపోయారు. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఇంజిన్ను ఆపేయడంతో పెను ముప్పుతప్పింది.కాగా దాదాపు 30 నిమిషాల పాటు విమానం రన్వేపైనే నిలిచిపోయింది. ఆ తరువాత భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.