కంపెనీపై కోపంతో.. సంస్థను అగ్గిపాలు చేశాడో వ్యక్తి. ఈ ఘటనలో 13 మంది ఉద్యోగులు మరణించారు. మరో 38 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందాని వైద్యులు తెలిపారు. జపాన్ లోని క్యోటో నగరంలో ఈ దారుణం చోటుచేసుకుంది. జపాన్ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10.30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.
క్యోటో యానిమేషన్ కంపెనీ పై ద్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి సంస్థ భవంతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. భవనం చెక్కతో చేసింది కావడంతో మొత్తం మంటల్లో చిక్కుకుంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్తాలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 48 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెప్పారు. అదేవిధంగా ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు.