చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై భారత్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి సమయంలో వీధుల్లోకి వచ్చిన క్రికెట్ అభిమానులు.. బ్యాండ్ బజాయిస్తూ బాణాసంచా కాల్చుతూ హంగామా చేశారు. జాతీయ జెండాలను చేతుల్లో పట్టుకుని భారత్మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. వరల్డ్కప్లో పాకిస్తాన్పై రికార్డు విజయం సాధించారంటూ సంతోషం వ్యక్తం చేశారు. కోహ్లీ టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ వరల్డ్ కప్ తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇటు హైదరాబాద్లో కూడా యూత్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డుపై పెద్ద ఎత్తున చేరుకున్న యువత టీమిండియాకు విషెష్ తెలిపింది. భారత్మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ జెండాలతో, బ్యాండ్ చప్పుళ్లతో హంగామా చేశారు. ముఖానికి మూడు రంగులు పూసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు.