డాన్ వణుకుతున్నాడు!

Update: 2019-05-26 08:58 GMT

అవును అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భరత్ లో ఎన్నికల ఫలితాలను చూసి వణుకుతున్నాడట. పాకిస్తాన్ సహాయంతో విచ్చలవిడిగా తిరుగాడిన ముంబయి మాఫియా లీడర్ దావూద్ ఇబ్రహీం 2019 తర్వాత అక్కడే రహస్య జీవితం గడుపుతున్నాడు. భారత ప్రభుత్వం దావూద్, అతని అనుచరులపై తీసుకున్న పలు వ్యతిరేక చర్యలతో తన స్వేచ్చను కోల్పోయి, ఐ ఎస్ ఐ సహాయంతో పాక్ లో రహస్యంగా ఉంటున్నాడు. ఇపుడు కేంద్రంలో బీజేపీ విస్పష్ట మెజార్టీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడంతో దావూద్ తీవ్ర ఆందోళనలో పడిపోయాడని ఓక జాతీయ మీడియా కథనం వెలువరించింది. తనను భారత్ నిఘా అధికారులకు దోర్కకుందా సురక్షితంగా ఉంచాలని ఐ ఎస్ ఐ అధికారులను ఆటను కోరినట్టు తెలుస్తోంది. ఈసారి భారత్, అమెరిక, ఇజ్రాయిల్ దేశాల మధ్య సఖ్యత ఏర్పడింది. ఈసారి అది మరింత బలపడే అవకాశం ఉంది. దాంతో తనను పాకిస్తాన్ బయటకు లాక్కోచ్చేందుకు ప్రయత్నాలు గట్టిగా జరుగుతాయని దావూద్ భావిస్తున్నాడట. అదీకాకుండా పాకిస్తాన్ వ్యవహారాలపై పట్టున్న భారత జాతీయ సలహాదారు అజిత్ దోబాల్ అసలు ఊరుకోదనీ.. తనను పట్టుకునేందుకు గానీ, మట్టు పెట్టేందుకు గానీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారనీ విపరీతంగా భయపడుతున్నాడు. ఇప్పటికే మోదీ సర్కారు.. విదేశాలకు పారిపోయిన పలువురు నిందితులను భారత్‌కు పట్టుకొచ్చింది. దావూద్‌ సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌ను కూడా అరెస్టు చేసింది. అండర్‌వరల్డ్‌ డాన్‌ ఆస్తులను సీజ్‌ చేసింది.  

Similar News