కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత... వైసీపీ నేతల హౌజ్‌ అరెస్ట్‌

Update: 2018-11-21 05:56 GMT

కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థుతులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం గొరిగనూరులో ఇవాళ పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరే కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న కడప మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జీ సుధీర్‌రెడ్డి, కడప మేయర్‌ సురేశ్‌ బాబులను పోలీసులు అడ్డుకున్నారు. గొరిగనూరుకు వెళ్లకుండా ముందస్తుగా హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. శాంతిభద్రతల పేరుతో వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా గొరిగనూరులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వమే కుట్ర పన్నిందని తమ హక్కులను కాలరాస్తున్నారని ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

Similar News