వరదలతో అల్లకల్లోలమైన కేరళను ఆదుకునేందుకు రాష్ట్రాలు, ప్రముఖులు, సామాన్యులు కూడా చేయి కలిపారు. ఆపదలో ఉన్న మలయాళీలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. తన తరఫున, పార్టీ తరఫున కేరళ వాసులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు కోటి రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి వైఎస్సార్సీపీ పంపనుంది.