లైంగిక వేధింపులు.. పురుషుని మర్మాంగాన్ని కోసేసిన మహిళ

Update: 2018-12-26 11:18 GMT

తనను రోజూ వేధిస్తున్న పోకిరీకి గుణపాఠం చెప్పాలని మహిళ భావించింది. రోజూ వెంటపడి వేధిస్తున్న అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించిన ఆమె కఠిన నిర్ణయమే తీసుకుంది. మాట్లాడుకుందాం రమ్మంటూ అతడ్ని పిలిచి ఇద్దరు యువకులతో సాయంతో అతడి మర్మాంగాన్ని కోసేసింది. ముంబైలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. తుషార్ పుజారా (27) అనే ఆ యువకుడు ఆ మహిళను ప్రతిరోజూ వేధిస్తున్నాడు. వెంటాడుతున్నాడు. శారీరకంగా తాకుతూ హింసిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక ఆ మహిళ తుషార్‌ను వలలోకి లాగింది. సంకేత స్థలానికి వచ్చేలా చేసింది. అక్కడికి తుషార్ రాగానే మరో ఇద్దరు యువకుల సహాయంతో దాడిచేసింది. వారిద్దరు తుషార్‌ను గట్టిగా పట్టుకుంటే తాను ముందే తెచ్చుకున్న కత్తితో మహిళ అతడి మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావమవుతున్న తుషార్‌ను స్వయంగా హాస్పిటల్‌లో చేర్చింది. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ అగాయిత్యానికి పాల్పడ్డ మహిళను, ఆమెకు తోడ్పడిన ఇద్దరు ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.