చల్లని కబురు

Update: 2018-05-25 05:09 GMT

నైరుతి రుతుపవనాలు ఈ నెల 29 కల్లా కేరళకు వస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి అరేబియా సముద్రంలో ఉన్న తీవ్ర తుఫాను 26 నాటికి తీరం దాటనుందని... ఆ తర్వాత రుతుపవనాలకు అనుకూల వాతావరణం నెలకొంటుందని వివరించింది. 27వ తేదీ రాత్రికల్లా ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. 28 నాటికి లక్షద్వీప్‌, కేరళను పడమర గాలులు తాకనున్నాయని.. 29 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది.29 నాటికి ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. నెలాఖరుకు ఈశాన్య రాష్ర్టాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది.
 

Similar News