జెండా ఆవిష్కరణలో విషాదం.. ఇద్దరు జవాన్లు మృతి

Update: 2018-08-15 04:38 GMT

ఒంగోలులో పంద్రాగస్టు జెండా ఆవిష్కరణ ఏర్పాట్లులో విషాదం చోటుచేసుకుంది. ఎన్‌సిసి కార్యాల‌యం వ‌ద్ద పంద్రాగ‌స్టు వేడుక‌ల సంద‌ర్భంగా ఏర్పా‌ట్లు చేస్తుండ‌గా..ట్రాన్స్ ఫార్మ‌ర్‌కు ఇనుప‌రాడ్డు త‌గ‌ల‌డంతో క‌రెంట్ షాక్‌తో ఇద్ద‌రు జ‌వాన్లు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మృతులు నేపాల్‌కు చెందిన బ‌సంత్ రాణా,శ్రీ‌కాకుళంజిల్లా మ‌ల్ల‌య్య‌పేట‌కు చెందిన గాలి అప్ప‌య్య‌నాయుడిగా పోలీసులు గుర్తించారు. 

Similar News