ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయం

Update: 2018-12-09 04:43 GMT

ప్రజాకూటమి 70 నుంచి 80 స్థానాలు తప్పక గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 12న ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని అన్నారు. తెలంగాణ ఓటర్ తీర్పు తమవైపే ఉందని కాంగ్రెస్ పార్టీ దీమాతో ఉందన్నారు. పోలింగ్ సరళి, జరుగుతున్న పరిణామాలు అంతా తమకు అనుకూలంగా ఉన్నాయని లెక్కలు వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూముల్లోకి అధికారులు కూడా వెళ్లకూడదని, ఆ రూమ్ లను కార్యకర్తలు, నేతలు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. చాలా విషయాల్లో ఎన్నికల సంఘం విఫలమైందని, ఈవీఎంలు మారవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయని అన్నారు.
 

Similar News