అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. టెక్సాస్ ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో ఉన్మాది మారణహోమం సృష్టించాడు. ఆదివారం ఉదయం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గన్తో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దొరికిన వారిని దొరికినట్లు పిట్టల్లా కాల్చిపడేశాడు. ఈ మారణహోమంలో 27మంది మృతిచెందగా 30మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
కాల్పులకు తెగబడ్డ ఉన్మాదిని పోలీసులు కాల్చిచంపారు. కాల్పులు ఘటన తెలుసుకున్న పోలీసులు క్షణాల్లోనే అక్కడికి చేరుకుని ఉన్మాదిని హతమార్చారు. అయితే కాల్పులకు తెగబడిన ఉన్మాది ఎవరన్న దానిపై టెక్సాస్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన వెనుక ఉగ్రసంస్థల కుట్ర ఏదైనా ఉందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఉన్మాది కేవలం 15 సెకన్లలోనే ఇంతమందిని పొట్టనబెట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.