తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం జరగబోయే మంత్రివర్గ సమావేశం అత్యంత కీలకంగా మారింది. పూర్తిగా ఎన్నికల కోణంలోనే కేబినెట్ భేటీ జరగబోతుందని సమాచారం. ప్రగతి నివేదన సభకు కొద్ది సేపటి ముందే కేబినెట్ భేటీ కానుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. శాసనసభ రద్దుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది.