తమకు సీట్లు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్. గన్పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన ఇంటి పార్టీ నేతలు అక్కడ నిరసనలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో బీసీలు కీలక పాత్ర పోషించారని, అయినా, వారికి సీట్ల కేటాయింపులో అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీట్ల జాప్యానికి కోదండరామ్, ఉత్తమ్కుమార్రెడ్డి కారణమన్నారు. కూటమి పోటీ విషయంలో అమరావతిలో లిస్ట్ రెడీ అవుతుందని, ఇంటి పార్టీని ముందు నుంచి కాంగ్రెస్ దూరం చేయాలని చూసిందని చెరుకు సుధాకర్ ఆరోపించారు. తాను హుజూర్ నగర్ నుంచి పోటీకి దిగుతానని ఆయన స్పష్టం చేశారు.