RJD నేత తేజ్ ప్రతాప్ యాదవ్ శివుడి అవతారం ఎత్తారు. తేజ్ నయా లుక్ హాట్ టాపిక్ మారింది. గతంలో ఓ దళితుడి ఇంటికి వెళ్లి స్నానం చేసి తనదైన మార్క్ను చాటుకున్న తేజ్ ఆ వెంటనే పెట్రోల్ ధరలకు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టారు. రీసెంట్గా శివుడి అవతారమెత్తడం చర్చనీయాంశంగా మారింది. పులి చర్మం ధరించి, మెడలో రుద్రాక్షలు, కమండలం, చెంబు చేతిలో పట్టుకుని అచ్చం శివుడి రూపంలో దర్శనమివ్వడం వైరల్గా మారింది.
పట్నాలో ఉన్న ఓ శివాలయానికి శివుడి వేషదారణలో వెళ్లడం హాట్టాపిక్గా మారింది. ఆలయానికి వెళ్లటం స్వయంగా ఆయనే పూజలు చేయటం, శంఖం పూరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తండ్రి ఆరోగ్యంగా ఉండాలని ఇలా శివాలయంలో ప్రత్యేక పూజలు చేశానన్నారు. తేజ్ శివుడిపై ఉన్న భక్తితోనే ఇలా చేశానంటున్నారు.
శివుడి వేషధారణలో ఉన్న తేజ్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటున్నారని ప్రశంసిస్తుండగా ఇదేం అవతారం అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా తండ్రికి తగ్గ తనయుడే అంటున్నారు అందరూ. లాలూ కంటే ఓ అడుగు ముందుకేసి ప్రచారంలో దూసుకుపోతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు