తాజాగా అక్బరుద్దీన్ హిందుత్వంపై అనుచిత వ్యాఖ్యాలు చేస్తున్న అక్బరుద్దీన్ పై స్వామి పరిపూర్ణానంద తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వదిలి వెంటనే పాకిస్థాన్కు పోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి మూసారంబాగ్ డివిజన్లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ తెలంగాణలో టీఆర్ఎస్,కాంగ్రెస్,ఎంఐఎం ఓడిపోవడం తథ్యమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజీపీ పార్టీ గెలిస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా వెంటనే మారుస్తామని తెలిపారు. మలక్పేటలో భూకబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న మజ్లిస్ అభ్యర్థి బలాలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈనెల 7న జరుగబోయే పోలింగ్ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కమలం గుర్తుకు ఓటే వేసి ఆలె జితేంద్రను భారీ మేజరిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోఢీ పాలనలో దేశంలో ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్ జరగలేదని, బాంబ్ పేల్చేవారిని దేశ సరిహద్దుల్లోనే మట్టికప్పించరని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు.