కాంగ్రెస్ ఎంపీని బ్లాక్ చేసిన సుష్మా స్వ‌రాజ్‌!

Update: 2017-12-29 11:05 GMT

ఇరాక్‌లో త‌ప్పిపోయిన 39 మంది భార‌తీయుల గురించి మాటిమాటికి అడుగుతున్న కార‌ణంగా ట్విట్ట‌ర్‌లో కాంగ్రెస్ ఎంపీ ప్ర‌తాప్ సింగ్ బ‌జ్వా ఖాతాను, విదేశాంగ‌మంత్రి సుష్మా స్వ‌రాజ్ బ్లాక్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ప్ర‌తాప్ సింగ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.‘‘విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను నడపవలసిన తీరు ఇదేనా? 39 మంది భారతీయులు ఇరాక్‌లో అదృశ్యమవడంపై ప్రశ్నించినందుకు బ్లాక్ చేయడం సుష్మా స్వరాజ్ గారి పని తీరును తెలియజేస్తోందా?’’ అని సింగ్ ట్వీట్ చేశారు.

Similar News