బాణసంచా అమ్మకాలు, తయారిపై దేశ అత్యున్నత న్యాయస్ధానం కీలక తీర్పునిచ్చింది. బాణసంచాను నిషేధించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను తిరస్కరించిన న్యాయస్ధానం ఇది వరకే ఉన్న పలు నిబంధనలను గుర్తు చేసింది. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే విక్రయాలు జరపాలన్న కోర్టు తగిన భద్రత లేకుండా విక్రయాలు జరపరాదంటూ ఆదేశించింది. ఇదే సమయంలో ఆన్లైన్లో అమ్మకానికి అనుమతి నిరాకరించింది. బాణసంచాను రాత్రి ఎనిమిది నుంచి పది గంటల మధ్యే కాల్చాలంటూ సూచించింది.