తిరుమల తిరుపతి దేవస్ధానంలో నెలకొన్న వివాదాలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా స్పందించారు. టీటీడీలో పరిపాలన చేస్తున్నది ఈవో ఏకే సింఘాలా? లేక రాజు గారా? అంటూ ప్రశ్నించారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆలయ మర్యాదలను బహిరంగంగా ప్రశ్నించిన రమణదీక్షితులు అమిత్షాను కలిస్తే తప్పేంటన్నారు వీర్రాజు. వేంకటేశ్వరస్వామిపై జరుగుతున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.