ఆర్మీ డిపోలో పేలుడు.. ఆరుగురు మృతి

Update: 2018-11-20 07:05 GMT

మహారాష్ట్ర వార్ధాలోని పుల్గాన్ ఆర్మీ డిపోలో ఇవాళ ఉదయం పేలుడు సంభవించింది. గడువు తీరిన మందు గుండు సామాగ్రిని నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
 

Similar News