బీజేపీకి బిగ్ షాక్...సీనియర్ నేత రాజీనామా

Update: 2018-06-25 10:47 GMT

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్తాన్‌లో బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత ఘన్‌శ్యామ్‌ తివారీ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు రాజీనామా లేఖ సమర్పించారు. సీఎం వసుంధరా రాజేపై తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనశ్యామ్‌... రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సాంగానేర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఆయన 60 వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు. కాగా ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఘనశ్యామ్ తివారీ తన కుమారుడు స్థాపించిన ‘భారత్ వాహిని పార్టీ’ నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. 

Similar News