హైదరాబాద్ వ్యాపారవేత్త సానా సతీష్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సీబీఐ విచారణ నుంచి మినహాయించలేమన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో దాఖలైన సమన్లపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రాణహాని ఉంటే హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాలని సూచించింది. ఈ కేసులో సీబీఐ విచారణకు సహకరించాల్సిందేనంటూ మరోసారి స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టి వేసింది.