మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్లున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారు బోల్తాపడి, కారులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. చనిపోయిన వారు ఒకే కుటుంబానికి చెందినవారు. భార్య, భర్త, 11నెలల చిన్నారి. హుటాహుటిన ఘటన స్థాలనికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.