రాజకీయంగా ఎదుర్కోలేకే ఓటుకు నోటు కేసును మళ్లీ తిరగదోడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. మత్తయ్యపై క్వాష్ పిటీషన్ వేస్తే హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఇదే కేసులో సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బలు తగిలాయన్నారు. మోడీకి ఎదురుతిరిగిన చంద్రబాబును, కేసీఆర్ ప్రత్యర్థి రేవంత్రెడ్డిని దెబ్బకొట్టేందుకు మోడీ, కేసీఆర్లు కలిసి కుట్ర పన్నుతున్నారని రేవంత్రెడ్డి చెప్పారు. ఈడీ, ఇన్కంట్యాక్స్, సీబీఐలతో తనపై కక్ష సాధింపునకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రయత్నాలు చేయిస్తున్నారని, తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా కేసీఆర్తోపాటు డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్రావులే బాధ్యత వహించాలని అన్నారు.